Share News

Laxminarayana: పార్టీలు వారికే టికెట్ ఇస్తున్నాయి.. లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:37 PM

అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

Laxminarayana: పార్టీలు వారికే టికెట్ ఇస్తున్నాయి.. లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. కాపాడటం కోసమే తమ పార్టీ వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారని చెప్పారు.

డబ్బులు లేకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆమె చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేస్తానని అన్నారు. తాను గెలిస్తే.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో మహిళలు వద్దంటే...లిక్కర్ షాపులు లేకుండా చేస్తామని అన్నారు. విశాఖలో డ్రగ్స్, గంజాయి విస్తరిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలు, అవినీతి రహిత ఆంధ్రాయే తమ ధ్యేయమని లక్ష్మీనారాయణ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 10:37 PM