Home » Vande Bharat Express
ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పుణె స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది.
కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.
యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
తిరుపతి-సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై ఆరెంజ్ కలర్లో రాకపోకలు కొనసాగించనుంది. అలాగే.. 16 బోగీలుండగా మరో నాలుగు బోగీలను చేర్చి మొత్తం 20 బోగీలు ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో.. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20703) హిందూపూర్లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్లో పేర్కొన్నారు.