Home » Uttam Kumar Reddy Nalamada- Congress
కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్పా మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు.
ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ను అత్యంత ప్రాధాన్యతగా తీస్కొని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. గురువారం నాడు సచివాలయంలో సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ప్రాజెక్టులపై పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
ఎఫ్సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 2వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి 100 ఎకరాల స్థలంలో పేదల కోసం కేటాయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
రైతు బంధు ఆపేయాలని తాను అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ( MP Uttam Kumar Reddy ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V. Hanumantha Rao) అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్కు ధీటుగా..
తన అంచనాల ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ గాంధీభవన్కు వచ్చారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారు.