Uttam Kumar Reddy అక్కడి నుంచే పద్మావతి పోటీ

ABN , First Publish Date - 2023-08-23T18:00:13+05:30 IST

కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి(Padmavati) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తెలిపారు.

 Uttam Kumar Reddy అక్కడి నుంచే పద్మావతి పోటీ

సూర్యాపేట: కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి(Padmavati) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తెలిపారు. బుధవారం నాడు కోదాడ(Kodada) పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR)ముదిరాజ్ కులానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించక పోవడం బాధాకరం.ముదిరాజ్ కులస్తులు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి. 12% ఉన్న ముస్లింలకు మూడు టిక్కెట్లు కేటాయించి ముస్లిం కులాలను అవమానపరిచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలవడం ఖాయం. అధికార పార్టీ నాయకులే ఈ ఎమ్మెల్యే వద్దని కేసీఆర్‌కు లేఖ రాస్తున్నారని చెప్పారు. వెంచర్ వేయాలంటే ఎకరానికి మూడు లక్షల రూపాయల ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాలని కండిషన్ పెట్టడం విడ్డురంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-23T18:00:16+05:30 IST