Share News

MP Uttam Kumar Reddy: నా మాటలను కేసీఆర్ వక్రీకరించారు

ABN , First Publish Date - 2023-10-27T22:43:00+05:30 IST

రైతు బంధు ఆపేయాలని తాను అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ( MP Uttam Kumar Reddy ) అన్నారు.

MP Uttam Kumar Reddy: నా మాటలను కేసీఆర్ వక్రీకరించారు

హైదరాబాద్: రైతు బంధు ఆపేయాలని తాను అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ( MP Uttam Kumar Reddy ) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘నవంబర్ 3వ తేదీ లోపు రైతు బంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాత్రమే నేను అన్నాను. నా మాటలను సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారు. కేసీఆర్‌కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేసి, లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాగానే రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నాం’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-27T22:43:00+05:30 IST