Home » Trending News
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సారి భారత్లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటిలో ఇప్పటి నుంచి మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.
ఫుట్బాల్ ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ డియాగో ఆర్మాండో మారడోనా మాత్రం లెజెండ్. ఆటను కళగా, ఆవేశంగా, దైవత్వంగా మలిచిన ఆ మహానుభావుడి జన్మదినం నేడు. అక్టోబర్ 30.. ప్రతి ఏడాది ఈ రోజున ఫుట్బాల్కు ఆత్మ లాంటి అతడి గొప్పతనాన్ని అభిమానులు సహ ప్రపంచమంతా స్ఫురించుకుంటుంది.
ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.
డెన్మార్క్కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్కు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) నాలుగేళ్ల నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆట జరుగుతున్న సమయంలోనే బెట్టింగ్కు పాల్పడినందుకు ఈ కఠిన చర్య తీసుకుంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
రోహిత్, విరాట్ వన్డే సిరీస్కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్ కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు.
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?