Home » Trending News
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటరైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చిరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టిన రోజు ర్యాగింగ్ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు. ఓజీ సినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
నేపాల్లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాసన సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్కు చేరుకున్నారు.
ఓ కారులో విలన్లు మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం.. వెనుకే పోలీసు వాహనం వెంటపడడం.. వంటి సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సీన్లు తలదన్నే సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. తాజాగా, తిరుపతిలో ఏం జరిగిందంటే..
ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు ఇలా చేశారు.. ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథేంటీ.. తదితర వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో ఫొటోలను వీడియోలుగా మార్చడం చూస్తున్నాం. అలాగే పాత ఫొటోలను కొత్తగా మార్చడం కూడా చూస్తున్నాం. అయితే ఇటీవల త్రీడీ ప్రింటింగ్ ట్రెండింగ్ అవుతోంది. మీ ఫొటోను త్రీడీలోకి మార్చడంతో పాటూ వివిధ రకాల భంగిమల్లో చూపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్నాళ్లూ పార్కులు, నిర్మాణుష్య ప్రదేశాలకే పరిమితమైన పాడు పనులు.. ప్రస్తుతం స్మశానవాటికలకూ పాకాయి. శవాలను పూడ్చే స్థలంలో సరసాలు సాగిస్తుండడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. బేగంపేట్ ధనియాల గుట్ట స్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది.