Indecent Acts in Cemetery: స్మశానంలో స్పెషల్ రూమ్.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ దృశ్యాలు..
ABN , Publish Date - Sep 12 , 2025 | 09:57 AM
ఇన్నాళ్లూ పార్కులు, నిర్మాణుష్య ప్రదేశాలకే పరిమితమైన పాడు పనులు.. ప్రస్తుతం స్మశానవాటికలకూ పాకాయి. శవాలను పూడ్చే స్థలంలో సరసాలు సాగిస్తుండడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. బేగంపేట్ ధనియాల గుట్ట స్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇన్నాళ్లూ పార్కులు, నిర్మాణుష్య ప్రదేశాలకే పరిమితమైన పాడు పనులు.. ప్రస్తుతం స్మశానవాటికలకూ పాకాయి. శవాలను పూడ్చే స్థలంలో సరసాలు సాగిస్తుండడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. బేగంపేట్ ధనియాల గుట్ట స్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్మశాన వాటికలో తనిఖీలు చేపట్టగా.. షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.
గ్రేవీ యార్డ్ దగ్గర ఉన్న గదిలో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక మహిళతో పాటూ విటుడికి నోటీసులు ఇచ్చారు. అలాగే నిర్వాహకురాలు మాధవిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బేగంపేట్ పోలీసులకు అప్పగించారు. గతంలో మాధవిపై బోయినపల్లిలో కేసు నమోదైనట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News