Home » Tollywood
తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల గౌరవ వేతనాల కోసం చేస్తున్న పోరాటం 13వ రోజులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఫిలిం ఫెడరేషన్ ఆందోళనను మరింత ఉధృతం చేసింది.
టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులు అయింది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్..
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం చిత్రం పరదా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేశారు.
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశం కానున్నారు. ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. తెలుగు ఫిలింఫెడరేషన్ స్ట్రైక్, వారి సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్తో ప్రధానంగా చర్చించనున్నారు.
సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మంత్రి కందుల దుర్గేశ్తో సమావేశం అయ్యారు.
ప్రతి గ్రామంలో ఒక్కరిని బాగు చేస్తే వారే ఊరును బాగు చేస్తారని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, సినీ హీరోయిన్ మంచు లక్ష్మీప్రసన్న వ్యాఖ్యానించారు. తమ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూతనిస్తున్నామని వెల్లడించారు.
సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15 శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత మరో 5 శాతం పెంచుతామని పేర్కొన్నారు.
సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.
పుష్ప-2 మూమీ సంధ్యా థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్గా స్పందించింది.