Home » Tirupati
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..
‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్ఎస్లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్కుమార్, సోదరి అశ్విని ఉన్నారు.
తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. దేవస్థాన పరిధిలోని అన్ని హాస్పిటల్స్లో వాలంటర్ల మాదిరి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
పాత సూపర్ లగ్జరీ బస్సులను ఏం చేయాలి? పర్యావరణ హితం.. సంస్థకు లాభదాయకంగా ఎలా మార్చాలి? ‘ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీలు’గా కన్వర్షన్ చేయడమే దీనికి పరిష్కారంగా అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులు మరిన్ని రోడ్డెక్కనున్నాయి.
పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్పాత్పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.
ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి మునిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్ తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు.