Home » Tirumala
Andhrapradesh: చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యలేదని.. పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారన్నారు. అందరూ ఏకమైన.. రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు.
Andhrapradesh: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఇవాళ (గురువారం) 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వారాంతంలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో వేసి మొక్కలు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ శనివారం వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు (గురువారం) స్వల్పంగానే ఉంది. వీక్ డేస్ కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కేవలం 2 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నేడు టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 66,915 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల పవిత్రతకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తుందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ (Buchi Ramprasad) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దేవాలయాలు, పూజారులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.