Home » TG Politics
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఒడిపోదని తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు.
నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు.
లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.