Home » TG News
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.
భారతదేశంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందుకే..
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్ర్తాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం లిఫ్ట్ పాడైపోయి అవస్థలు పడిన అధికారులు, ఉద్యోగులు తాజాగా పది రోజులుగా నీటి సరఫరా కరువై సతమతమవుతున్నారు.
జలమండలి అధికారి పేరిట ఓ సైబర్ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్మండికి చెందిన రిటైర్డ్ ప్రభుతోద్యోగికి వాటర్ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్ చేశాడు.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు.....
కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారనీ కేసు నమోదైంది. అయితే..