Home » terror attack
Operation Sindoor 2025: పహల్గాం ఉగ్రదాడికి ఏ క్షణానైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి భారత త్రివిధ దళాలు. ఇంతకీ, ఇంత కచ్చితంగా భారత ఆర్మీ టార్గెట్లను ఎలా ఎంపిక చేసింది. అనుకున్న ప్లాన్ ఎలా అమల్లో పెట్టింది.
Operation Sindoor Pakistan: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు, సైన్యం ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని పలువురు ప్రముఖులు మద్దతు పలికారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు పలువురు రాజకీ, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్.. జై భారత్.. భారత్ మాతా కీ జై అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.
Minister Ponnam Prabhakar: హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
భారత్ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్ అన్నారు. భారతదేశం పాకిస్థాన్లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు.
భద్రతా సన్నద్ధత కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలనీ రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన వెంకటరావు అన్నారు. ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్థాన్పై ప్రభుత్వ చర్యలకు ప్రజల మద్దతు అవసరం అని సూచించారు
బలూచిస్థాన్లో ఉగ్రవాద దాడిలో 7 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. బీఎల్ఏ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది