Home » TDP
2026వ సంవత్సరం జూన్లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం ఏడు ప్రధాన రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో కళాశాలల నిర్మాణాలు లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం మాజీ సీఎం జగన్కే చెల్లిందని హోమ్ మంత్రి అనిత విమర్శించారు. 17 వైద్య కళాశాలలు నిర్మించానని చెప్తున్న జగన్ వాటి క్షేత్రస్థాయి పర్యటనకు రాగలరా..? అని ప్రశ్నించారు.
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత జగన్పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జన సైనికుల జోరు.. కమలదళ ఉత్సాహం కలగలసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గత వైసీపీ పాలనలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కూటమి పాలనలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు.
సీఎం చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంగళవారం బాలాజీనగర్లోని టీడీపీ కార్యాలయంలో రొళ్ల మండలం అవినకుంట, జీజీహట్టి, దొడ్డేరి గ్రామాలకు చెందిన 20 కుంటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్సిక్స్- సూపర్హిట్ బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని 25వ వార్డులో తెలుగుమహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించా రు. 25వ వార్డులోని ప్రియాంక నగర్, హమాలీకాలనీ, లక్ష్మీచెన్నకేశ వపురం ప్రాంతాలలో సోమవారం టీడీపీ వార్డు ఇనచార్జ్ భీమనేని ప్రసాద్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుమహిళలు విజయలక్ష్మి, పుష్పలత, సుజాత, రాజేశ్వరి, రక్షిత, సుశీల, నాగమణి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సీఎం బహిరంగ సభకు తరలిరాలని కోరారు.