Home » Tamilnadu News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్స్టాండ్స్కి 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇటీవలి కేంద్ర ఉత్తర్వులను పాటించారు.
తమిళనాడులో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజ్ఞప్తి చేసింది.
టీవీకే పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్ వీడియోపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత దినకరన్ స్పందించారు. టీవీకే విడుదల చేసిన వీడియోపై అనుమానాలున్నాయని అన్నారు.
రెండేళ్ల క్రితం ఆవిర్భవించి, తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ.. తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్పదూరాన నిలిచిపోయి, 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది.
టీవీకే పార్టీ అధినేత విజయ్కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్ను కలిశారు. మూడోసారి కూడా విజయ్కి నిరాశే ఎదురైంది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. కాంగ్రెస్తో పాటు వీసీకే, సీపీఎం, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్ను కలుస్తారని టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి.
విజయ్కు చెందిన TVK పార్టీకి మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై చర్చించడానికి విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేత బినోయ్ విశ్వం చెబుతుంటే, అసెంబ్లీ వేదికగా టీవీకేకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేస్తున్నారు.