Home » Tamilnadu News
తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధినేత విజయ్ ప్రచారసభలో శనివారం తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను రాజకీయం చేయబోమని సీఎం స్టాలిన్..
తొక్కిసలాట కారణంగా జయ చనిపోయింది. మురుగన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షోలో మరణ మృదంగం మోగింది. ఈ విషాదంలో 38 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ... మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలివచ్చారు....
ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బెంచ్ మద్దతు ఇచ్చింది.
దళపతి విజయ్ సినిమాల్లో హీరోగా కొనసాగుతుండగా, తాజాగా మదురై వేదికపై మాత్రం ఓ కొత్త నాయకుడిగా కనిపించారు. రెండో రాష్ట్రస్థాయి సమావేశంలో విజయ్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేయనుంది. రేషన్ కార్డు నుంచి బస్ టిక్కెట్ల వరకు తొలి దశలో 50 సేవలను అందించనుంది. ఇందుకోసం ఫేస్బుక్ మాతృసంస్థ మెటాతో ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లో ఏఐ (కృత్రిమ మేథ) టెక్నాలజీతో వీటిని ప్రజల వద్దకు చేర్చనుంది.
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఇవాళ సరికొత్త భాషా విధానాన్ని ఆవిష్కరించింది. హిందీ లేని, మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్, కృత్రిమ మేధ(ఏఐ), సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా..
మీరు హోటల్లో స్పెషల్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసి కోడి మాంసమని సంతోషంగా తింటున్నారా. కానీ ఓసారి తినే ముందు అది చికెన్ అవునా కాదా అని పరిశీలించండి. ఎందుకంటే ఇటీవల చిల్లీ చికెన్లో కోడికి బదులు గబ్బిలాల మాంసం సర్వ్ చేస్తున్నారు.
చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగుతోంది. ప్రధాని మోదీ గంగైకొండ చోళపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు.