Home » Tamilaga Vettri Kazhagam
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధికార కూటమిలో చేరాయి.
దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 21న విస్తరించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు, కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తాజాగా సీపీఎం హెచ్చరిక చేసింది. అన్నాడీఎంకే వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకువాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఇంతవరకూ ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని తెలిపింది.
తొలి ఎన్నికల్లోనే తమిళనాట తిరుగులేని అదరణతో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే పొరుగున ఉన్న కేరళంలో రాజకీయ విస్తరణ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేరళలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్లో ఆదివారంనాడు సమావేశమయ్యారు.
సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం విజయ్తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ప్రజలకు అసౌకర్యం కల్పించడం కానీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కానీ చేయవద్దని సూచించింది.
టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్కు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్లకు చోటు కల్పించనున్నారు.