Home » Tamilaga Vettri Kazhagam
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలన అనేది సినిమా కాదని, ఇందులో రీటేక్స్ ఉండవని అన్నారు. శివగంగలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో చిదంబరం ప్రచారం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తిరునల్వేలిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే చీఫ్ విజయ్ పాల్గొన్నారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు 'పూర్తి అధికారాలు' ఉంటే ఈరోజు తిరునల్వేలిలో ఈ సభ జరిగుండేది కాదని అన్నారు.
కేంద్రంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీజేపీ, కాంగ్రెస్పై టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరికి చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు టీవీకే నూటికి నూరు శాతం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో విజయ్ పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది.
రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని విజయ్ సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.
మహాబలిపురంలో ఆదివారంనాడు జరిగిన పార్టీ స్ట్రాటజీ మీటింగ్లో విజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.