Home » Srisailam
శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
రాజస్థాన్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకాన్ని 2027 డిసెంబరు 9వ తేదీకల్లా పూర్తి చేయాలని , అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు రిజర్వ్ ఫారె్స్టలో నిర్మించతలపెట్టిన మార్గం అలైన్మెంట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోని శ్రీశైలానికి చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ..
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్దేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ‘నేను అభ్యర్థిస్తున్నాను.. నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయకండి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలి’ అని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.