Home » Savitha
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించడంతో పాటు... పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్కోచ్ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి సవితకు ఢిల్లీలో ఈ స్కోచ్ అవార్డును అందజేశారు.
భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
పన్నెండేళ్లుగా పేదలకు, కేన్సర్ రోగులకు సేవలందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతోమందికి ఆదర్శనీయమని మంత్రి సవిత అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర(నగరాలు) సామాజిక వర్గీయులను బీసీ-డీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జారీచేసేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు.
ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.
Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.