Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మాంజా కారణంగా గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్కు సూచించారు.
జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురిని ప్రేమించాడనే నెపంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి దాడిచేసి హతమార్చారు కుటుంబ సభ్యులు.
సర్పంచ్ పదవికి లవర్తో కలిసి నామినేషన్ వేశాడు ఓ యువకుడు. అనంతరం, ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.
సర్పంచి పదవికి శ్రీజ అనే ఒక యువతి నామినేషన్ వేయడం, తల్లిదండ్రులు వద్దంటూ ఒత్తిడి చేయడం, ఆ వెంటనే శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీసుల ముందు హాజరై తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడం.. రాజకీయ మద్దతు. ఇలా.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒక్క రోజులో సంచలనాలు