Home » RSS
జన్సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని మోహన్ భగవత్ అన్నారు.
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.
సంఘ్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీని వీక్షించారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటుచేశారు. సినిమా చూసిన అనంతరం.. ఆయన ఏమన్నారంటే.?
సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.
సర్దార్ పటేల్ అప్పట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావిస్తూ, మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్టు తెలిపారు.
ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆర్ఎస్ఎస్ తరఫున ఎందుకు మాట్లాతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.