Home » RJD
కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.
బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎం మీద రాజకీయ కుట్ర రచించాయని..
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.
తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
బిహార్లోని అన్ని భాగస్వామ్య పార్టీలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాలపై ఖర్గే తుది చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.
బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నేత, భూ వ్యాపారి రాజ్ కుమార్ రాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.