Home » Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలనలో ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసిందని అన్నారు.
ఈనెల 18వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా ఏదులాపురానికి విచ్చేస్తున్నారు. అక్కడ జరిగే ఆయా పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని తెలిపారు.
హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా పనులు ధరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు విచ్చేయనుండడంతో.. ఆయన వచ్చే దారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.