Home » Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్భవన్లో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.
పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిజాయితీగా తీసుకురాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు విషయాలను ప్రియాంక బయటపెట్టారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్ రైస్ను) సేకరించాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణను గ్లోబల్ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమం స్పష్టమైన ఫలితాలిస్తోంది.
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.