Home » Reservations
జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు ఆర్.కృష్ణయ్య. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ ప్రజల నోరు కొట్టడమేనని.. నోటికాడ అన్నం ముద్ద లాక్కోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్ల జీఓను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ -09 విడుదల చేసింది రేవంత్రెడ్డి సర్కార్.
మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్య ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రకటించింది.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.
బీడ్ జిల్లాలోని మంజర్సుమ్బాలో ఆదివారంనాడు నిర్వహించిన ర్యాలీలో మనోజ్ జారంగే మాట్లాడుతూ, తమ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు.
దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.