Home » Reliance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లను దాటేసింది.
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్ను తాకింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.
దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ తన వ్యాపారాన్ని క్రమం గా కొత్త రంగాల్లోకి విస్తరింపజేస్తూ వస్తున్నారు. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్ అండ్ కెమికల్ నుంచి...