Home » Ranga Reddy
రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిస్సాకు చెందిన సోమ్యా రాజన్గా గుర్తించారు.
రంగారెడ్డి: జిల్లా పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నేతాజీనగర్లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా ఆ ప్రాంతంలో నల్లటి పొగ అలుముకుంది.
రంగారెడ్డి జిల్లా: నార్సింగీలో దారుణం జరిగింది. మంచిరేవులలో జంగయ్య అనే వాచ్ మన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు మధ్య వివాదం చెలరేగింది. చినికి చినికి గాలి వానగా మారి జంగయ్యను మేస్త్రి అర్జున్ హత్య చేశాడు.
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మొయినాబాద్ మండలంలో గల బాకారం గ్రామ రెవెన్యూలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వారు వెంటనే మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందజేశారు.
Telangana: జిల్లాలో రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. బైక్లో తరలిస్తున్న రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
Telangana: జిల్లాలోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది.
Telangana Elections: పోస్టల్ బ్యాలెట్ అందలేదని జిల్లాలో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు సిబ్బంది చేరుకుంటున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది.
Telangana Elections: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
Telangana: జిల్లాలోని మొయినాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.