Home » Ram Mohan
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పందిస్తూ, పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని ప్రకటించారు.
మయన్మార్లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి రామ్మోహన్ లేఖ రాశారు..
శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ రేపటిలోగా డబ్బులు రిఫండ్ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.
ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్పై వైసీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు జగన్కి అధికారం ఇస్తే ఏం చేశారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.