Home » Ram Mohan
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. సోమవారం ఉదయం హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.
‘ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారికి సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులా? విశ్లేషిస్తే దౌర్జన్యాలా? అని ఫైర్ అయ్యారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో పవర్ఫుల్ ఇండియన్స్ (శక్తిమంతమైన భారతీయులు) జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించిన వంద మంది శక్తిమంతమైన భారతీయుల జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానాన్ని పొందారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని ధ్వజమెత్తారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయానరంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పందిస్తూ, పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని ప్రకటించారు.
మయన్మార్లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి రామ్మోహన్ లేఖ రాశారు..
శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.