Home » Rains
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు.
వర్షం పడినప్పుడు సర్వ సాధారణంగా అంతా గొడుగు వాడతారు. వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కూడా గొడుగును వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో వివిధ రంగుల డిజైన్లతో గొడుగులు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లో ఉన్న 18 జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
తూర్పు విదర్భ - తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అలాగే ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.