Home » Rains
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వానలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 22 నుంచి ఏపీలో భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.