Home » Rains
ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి.
రాబోయే 24 గంటల్లో కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
వేసవి కాలం.. అందునా రోహిణి కార్తె కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశానికి ఇంకా సమయం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలను గాలివాన అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈరోజు ఉదయం మైలవరంలో పర్యటించారు.