Home » Rain Alert
Rain Forecast: ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడన ప్రభావం పడనుంది. మే 26, 27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణానికి ఎనిమిది రోజులు ముందుగానే కేరళను తాకాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
Rains Alert: ఆంధ్రప్రదేశ్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. దానికి అల్పపీడనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసి, పిడుగుపాటుకు నలుగురు మరణించారు.
Telangana Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏ ప్రాంతాల్లో వర్షం కురవనుంది. ఏయే జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rain Alert: ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్ర, శనివారాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పిడుగులు, ఈదురుగాలులతో కలిసి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగుతున్నాయి.