Home » Rahul Gandhi
పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా జెన్ జీతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన తల్లి సోనియా గాంధీ పెంపుడు కుక్క నూరీని జనాలకు పరిచయం చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విద్యార్థులతో నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతి రద్దు కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తనను ఎవరూ అడ్డుకోలేరని, విద్యార్థుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు ఈ సమావేశాలు సజావుగా సాగనందున.. త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
నియోజకవర్గ పునర్విభజన బిల్లును కేంద్రం మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకురానుందన్న వార్తల నడుమ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. అంధభక్తులంటూ కొంతమందిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్పితా చటర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే, ఆమె ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ.. పేపర్ లీక్పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు.