Home » Puttaparthi
రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జిల్లాకేంద్రంలో హను మాన దేవాలయం లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేసిన వారు గురువారం కన్నెపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి, నవగ్రహ పూజ, గణపతిహోమం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయ్యప్పస్వాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్ఎస్డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా శాఖ మంత్రి లోకేష్ సహ వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, అధికారులు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.
మానవ సేవే.. మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్టు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా సేవలందించారని... ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు.
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.