Home » Ponnam Prabhakar
తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ .
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని మంత్రి పొన్నం తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టకుపోయిందని అన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు.. గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
చెక్ పోస్ట్ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి పెరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికే వాహన్, సారథి లో 28 రాష్ట్రాలు చేరాయని.. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదంటూ ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.
సునీత కన్నీళ్లు పెట్టుకోవటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.