Home » Pawan Khera
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్పై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వారం రోజుల ట్రాన్సిట్ బెయిలుపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించింది. ట్రాన్సిట్ బెయిలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
కాంగ్రెస్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్పోర్టులు ఉన్నాయంటూ ఖేడా చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్య రిణికి భూయాన్ శర్మ తనపై చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా తెలంగాణ హైకోర్టును బుధవారంనాడు ఆశ్రయించారు. ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ వేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ పోలీసు కేసు పెట్టడంతో అస్సాం పోలీసుల బృందం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసానికి మంగళవారంనాడు వెళ్లారు. రిణికి భూయాన్కు మూడు దేశాల పాస్పోర్టులు, విదేశాలతో ఆస్తులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్లో సీఎం వెల్లడించకుండా దాటిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల ఆరోపించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు.
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ మాధవి పూరి బుచ్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మాధవి పూరి బుచ్ ఒకేసారి మూడు చోట్ల జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష 'ఇండియా' కూటమిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్ను సీరియస్గా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది.