Home » Parliament
జనవరి 28తో ప్రారంభమయ్యే తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉభయసభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని వెల్లడించారు.
డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. మొత్తం 15 రోజుల పాటు సాగిన సమావేశాల్లో లోక్ సభ పలు కీలక బిల్లులను ఆమోదించింది.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు.
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్షా చెప్పారు.
పార్లమెంటులో వందేమాతరంపై 10 గంటల పాటు చర్చ జరగడాన్ని విమర్శిస్తూ బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ చర్యతో భారత్లో పలు సమస్యలు పరిష్కారమయ్యాయంటూ ఆయన చురకలు అంటించారు.
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్షా అన్నారు.
భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.
వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్షా అన్నారు.