Home » NRI News
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC) 1996-2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19-21 తేదీల్లో అమెరికాలోని లానియర్ ఐలాండ్స్లో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వారి కాలేజ్ రోజుల స్నేహబంధాలను, పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.
ఈ ప్రాజెక్ట్కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. సాన్ వాకిన్ కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం ఒక డాలరు ఫీజుతో భవనాన్ని లీజుకు ఇస్తోంది.
బ్రిటన్లోని లీడ్స్ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు, పురోహితులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిటన్లోని పలు తెలుగు సంఘాలు ఈ కల్యాణోత్సవం విజయవంతం కావడంతో.. కీలక భూమిక పోషించాయి.
అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించించారు.
పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. అందులో భాగంగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది.
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు.
వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'హృదయ నాదం' పేరుతో సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీతకారుడు వీణాపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బహ్రెయిన్లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.
ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు జీరో ప్లాస్టిక్ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.