Home » NRI Latest News
రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా వ్యవహారించే సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడును అమరావతిలోని సచివాలయంలో కలిశారు. సాటి తెలుగు వారి కోసం సాటా సెంట్రల్ చేస్తున్న సేవలను వివరించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వైనాన్ని సీఎంకు చెప్పారు.
ఎడారిలో జన వనరుల విధాన పరిశీలనకు రావాలంటూ ఏపీ మంత్రి నిమ్మకాయల రామనాయుడును సౌదీ ఎన్నారై ప్రముఖుడు మల్లేశన్ ఆహ్వానించారు. మంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు ఆహ్వానించారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం భారత్కు లాభం చేకూరుస్తుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్ అన్నారు. డల్లాస్ పర్యటన సందర్భంగా ఆదివారం అక్కడి ప్రవాసులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫ్రిస్కోలోని హనుమాన్ ఆలయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరాడు. మహా కుంభాభిషేక వేడుకల్లో భాగంగా స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా జరిగింది.
ఎన్నారైల సమస్యలను అధ్యయనం చేసేందుకు జనసేన బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా భాగమవుతారని జనసేన పార్టీ సౌదీ ప్రాంతీయ అధ్యక్షుడు తాటికాయల మురారి ఒక ప్రకటనలో తెలిపారు
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావును ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమానికి ఎన్నారైలు చేయూత నివ్వాలని, ఆట్టడుగు వర్గాలకు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కెనడాలో పొరపాటున తూటా తగిలి భారతీయ విద్యార్థిని కన్నుమూసిన కేసులో ఓ నిందితుడిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.