Home » NRI Latest News
గల్ఫ్లోని తెలుగు యువకులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
సౌదీ అరేబియాలో స్థానిక తెలుగు ఎన్నారైలు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. జెధ్ధా నగరంలో తెలుగు గ్లోరియస్ చర్చ్ (జి.టి.సి) ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు కట్టింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, నూతన సాంకేతికతలో శిక్షణ వంటి వాటికి అవకాశాలు మెరుగుపడ్డాయి.
దుబాయ్ తెలుగు అసోసియెషన్ ఆధ్వర్యంలో ఉమ్మాల్ ఖ్వెయిన్లో ఉత్సాహభరితంగా క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ క్రికెట్ పోటీల్లో దుబాయితో సహా వివిధ ఎమిరేట్ల నుంచి తెలుగు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఒంగోలుకు చెందిన ఓ ఎన్నారై తన స్వగ్రామంలో సొంత ఖర్చులతో స్మశానాన్ని నిర్మించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం వారు పరాభవ నామ సంవత్సరపు ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్లో వైభవంగా నిర్వహించారు.
అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అందరూ సమావేశమై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చట్టబద్ధమైన రాజధానిగా అమరావతి ఏర్పడిన నేపథ్యంలో బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో ఏప్రిల్ 3వ తేదీన ఎన్నారైలు ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు.
అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి.