Home » MLC Kavitha
జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు.
తెలంగాణలో కక్ష సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని పదే పదే చెప్పింది చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు..
బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ‘నేను చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు.
బీఆర్ఎస్లోని పెద్ద నాయకుల తీరుపై కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
తాను చేపట్టదలచిన 72గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలికేకలు ఎవరికీ పట్టడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ అందక 16 వేల కార్మిక కుటుంబాలు పూట గడవడానికే అవస్థలు పడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.