Home » MLA
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా నన్ను కెలకొద్దంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యమని, ప్రతి పేద వారి కుటుంబం బంగారు కుటుంబం కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. ఆయన ఆదివారం మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుం చి పుంగనూరు బ్రాంచ కెనాల్కు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ భైరవప్రసాద్తో కలిసి నీటిని విడుదల చేశారు.
‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదు. సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మా యువనేత లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
‘‘దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం... అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు.
ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్ వాంబే ఇళ్లను త్వరలో కూల్చివేసి కొత్తవి నిర్మించి ఇస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్ వాంబే ఇళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సికింద్రాబాద్, ముషీరాబాద్ తహసీల్దార్, అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు.
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.