Home » Mancherial district
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్ అన్నారు. శ్రీరాంపూర్లోని అరుణక్కనగర్ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్రావు, గడ్డం వివేకానంద్, గడ్డం వినోద్లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు.
రైసుమిల్లుల యజమానులు ధాన్యం బకా యిలు ప్రభుత్వానికి చెల్లించకుంటే చట్టపర మైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ముదిగుంట గ్రామం లోని బీఎస్వై రా రైసుమిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను తని ఖీ చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది.
సీపీఐ వందేళ్ళ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజలు, కార్మికులు, రైతుల సమ స్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.
క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్ బేస్బాల్ చాంపియన్ షిప్ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
నస్పూర్లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు.