Home » Mamata Banerjee
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.
తృణమూల్ కాంగ్రెస్కు లోక్సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.
పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.
టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.
మమతా బెనర్జీ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ పడిన దృశ్యాల తాలూకా మరో వీడియోను బీజేపీ నేత డెబ్జిత్ సర్కార్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. ఆ వీడియోలో మమతా బెనర్జీ స్పష్టంగా కనిపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనాపూర్లో స్థానికులు అభిషేక్పై విచక్షణా రహితంగా దాడి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. మేనల్లుడిని పరామర్శించారు.