Home » Mamata Banerjee
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆమెను ఒడిశా పంపించాలంటూ..
కోల్కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న 'అవినీతి ఆరోపణలు' బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
అమిత్షా ప్రవేశపెట్టిన బిల్లులపై మమతా బెనర్జీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ బిల్లులతో దేశంలో ప్రజాస్వామ్య శకం ముగిసినట్టేనని, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చరమగీతం పాడినట్టవుతుందని ఆరోపించారు. ఈ బిల్లులతో ప్రధానికి, హోం మంత్రికి అధికారులు వస్తాయని, ఈ చర్య సూపర్-ఎమర్జెన్సీని మించిపోయే చర్య అని అభ్యంతరం తెలిపారు.
మమతా బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో 1999 నుంచి 2001 వరకూ పనిచేశారు. రెండోసారి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో 2009 నుంచి 2011 వరకూ పనిచేశారు.
కోల్కతా లోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బెంగాల్ మళ్లీ ఒక్కసారిగా అట్టుడికింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ..
దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీల మీద దాడులు జరుగుతున్నాయని, అది భాషా
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.
బెంగాలీ మాట్లాడే 300 నుంచి 400 మంది వలస కార్మికులను సరైన డాక్యుమెంట్లు చూపించినప్పటికీ రాజస్థాన్లోని ఒక భవనంలో ఈరోజు నిర్బంధించినట్టు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ చెప్పారు.