Home » Mamata Banerjee
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు 10 జన్పథ్లో కలుసుకున్నారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండియా కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే ఉభయులూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది.
లోక్సభలో కొత్త చీఫ్ విప్గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్సభ స్పీకర్కు అధికారికంగా లేఖ రాశారు.
నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష ఇండీ కూటమి స్పష్టం చేసింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.
తృణమూల్ కాంగ్రెస్కు లోక్సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.
పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.