Home » Madhavaram Krishna Rao
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోయిన్చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్పేట డంప్ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ నర్సింహ యాదవ్తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.
ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్ హాల్ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు.
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు వదిలేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించడం సరికాదన్నారు.
కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే బీఆర్ఎస్ నాయకుడి మృతిచెందాడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బోరబండలో ఇళ్లు కట్టుకుంటున్న పేద కుటుంబానికి చెందిన వారిపై కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని విస్మరించిందన్నారు.