Share News

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:03 AM

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్‌ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్‌ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ పథకం పేదింటి ఆడపడుచులకు ఎంతో ఆసరాగా నిలిచిందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కార్పొరేటర్లు నర్సింహ యాదవ్‌, రవీందర్‌రెడ్డి, మహేశ్వరి, శ్రీహరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

city7.2.jpg


కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..

ఆడబిడ్డల వివాహాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌ అన్నారు. మంగళవారం బాలానగర్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు యుగంధర్‌రెడ్డి, లక్ష్మయ్య, పుష్పారెడ్డి, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 10:03 AM