Home » Kuppam
కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో బంగారు గనుల అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని, టీటీడీ నిధులతో ఆలయాల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కుప్పం నుంచి మరోచోటికి వెళ్లే పరిస్థితులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నలగంపల్లె గ్రామంలో నెట్జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు.
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. జూలై 3 నుంచి 5వ తేది (మూడు రోజులు) కుప్పంలో ఉండనున్నారు.
మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్ అధికారి జయశంకర్, పీకేఎం ఉడా చైర్మన్ డా.సురే్షబాబులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. బుధవారం సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీశ్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.