Home » Kuppam
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్ఎన్ఎ్సఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎంతకాలంగానో తామెదురుచూస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని కూటమి ప్రభుత్వం పెంచడంతో నాయీ బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు.
నడిమూరు గ్రామంలోని వంద ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ను అమర్చడం ద్వారా నడిమూరు పైలెట్ ప్రాజెక్ట్ను అధికారులు విజయవంతం చేశారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
CM Chandrababu: స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి.
CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.