Home » Kuppam
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఓ జాబ్మేళా కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత కష్టాన్ని నమ్ముకుని, స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు..
గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు..
పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
స్వర్ణనారావారిపల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలాన్ని తీర్చిదిద్దనున్నారని చెప్పారు.