Home » Kukatpally
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయ ధరలు (కిలో, రూపాయల్లో) వివరాలు ఇలా ఉన్నాయి. టమోటా 19, వంకాయ 35, బెండకాయ 35, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 45, కాకరకాయ 32, బీరకాయ 40, క్యాబేజీ 19, బీన్స్ 65, క్యారెట్ 33, గోబి పువ్వు 25, దొండకాయ 35లకు విక్రయిస్తున్నారు.
విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్లో డివిజన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లిలోని హనుమాన్దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ కూకట్పల్లిలో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 23, బెండకాయ 38, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 40, కాకరకాయ 31, బీరకాయ 41, క్యాబేజీ 17, బీన్స్ 45, క్యారెట్ 38, గోబి పువ్వు 25, దొండకాయ 33, చిక్కుడు కాయ 45లకు విక్రయిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో భర్త, కుమారుడితో నివాసం ఉంటుంది. అయితే.. హర్ష కొద్ది రోజుల క్రితమే ఆ ఇంట్లో పనికి కుదిరాడు.
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.