Home » KonaSeema
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలించడం చట్ట విరుద్ధమని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలకు చేరుకున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసి ఎంఎల్ఎస్ పాయింట్లలో భద్రపరిచినట్లు చెప్పారు. మండపేట మండలం వేములపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద 82.944 మెట్రిక్ టన్నులు, అంబాజీపేట మండలం ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద 20.506 మెట్రిక్ టన్నుల సీజ్చేసిన బియ్యం ఉందన్నారు.
శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాల్వలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల క్రాస్బండ్లు ఏర్పాటుచేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు మార్చి 10 నుంచి చట్టబద్ధమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్లో మొదటి సూత్రమైన జీవో ప్రోవర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ పి-4 విధానాన్ని రూపొందించిందన్నారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు.
కోకో పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మర్కెట్లో పలికే గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరిలో కోకోను అంతర పంటగా అభివృద్ధి చేసి జిల్లాను కోకో హబ్గా తీర్చిదిద్దాలని రైతులకు ఆయన సూచించారు.
దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మంగళవారం చంద్రప్రభ, సూర్యవాహనాల గ్రామోత్సవాలు జరిగాయని, భక్తుల కోర్కెలు తీర్చే శ్రీకరుడు, సర్వశుభాలను ఇచ్చే శుభకరుడు లక్ష్మీనరసింహస్వామి ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకంగా ఉన్న అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభించామన్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధ్రువీకరించిన ఆక్వా రంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు.
జిల్లాలోని వశిష్ఠ, గౌతమి నదుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్లను గుర్తించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. గుర్తించిన రీచ్ల అనుమతుల మంజూరు కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబోమన్నారు.
ఈ నెల 4 నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్య చర్యలపై ప్రత్యేకంగా 860 మంది సిబ్బందిని నియమించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి తెలిపారు.