Home » KonaSeema
ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను లైన్ విభాగాల అధిపతులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి పేపరు లీకేజీలకు, మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
సముద్ర తీర ప్రాంతంలోని ఆక్వాజోన్ ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి వారం రోజుల్లో సర్వే చేసి గుర్తించాలని కలెక్టర్ మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్లతో సహా బృందాలు సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో చెరువులను గుర్తించాలన్నారు.
సమస్యలపై అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలతో పాటు స్వర్ణాంధ్ర విజన్, రెవెన్యూ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోని (ఏఎంసీ) చైర్మన్ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 9 వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమలాపురం రైతు బజార్ ఈ నెల 25న పునఃప్రారంభించనున్న దృష్ట్యా రైతుబజార్లోని దుకాణ సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ నిషాంతితో కలిసి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతుబజార్ ప్రాంగణ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ఆయా శాఖల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గంటిపెదపూడి వద్ద అను మతులు లేకుండా తువ్వ మట్టిని తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తహ శీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తువ్వమట్టినీ వదల్లేదు! వార్తకు స్పందించిన అఽధికారులు తనిఖీలు నిర్వహించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడబాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన ఆయన 1994లో బీజేపీలో చేరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వర్తించారు.
76వ గణతంత్ర వేడుకలను అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు.
కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.