Home » KonaSeema
ముమ్మిడివరం, మార్చి 8 (ఆం ధ్రజ్యోతి): మహిళా దినోత్సవం రోజున ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడపై నరికిన సంఘటన ముమ్మిడివరం మండలం అనాతవరంలో జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతలో పంతగంటి
కుంభమేళాలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి.. మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయిపోయింది.
ఉప్పలగుప్తం/అమలాపురం టౌన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మఽధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు పులిదిండి సుజాత అందజేసిన రాగిజావను తాగిన విద్యార్థులు తొలుత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం 12.10 గంటలకు
అమలాపురం డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడం వల్ల విడుదలవుతున్న పొగతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, చెత్త వేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం డంపింగ్ యార్డు ముఖద్వారం వద్ద పరిసర ప్రాంతాల వార్డు ప్రజలు టెంట్ వేసి ధర్నా చేపట్టారు.
బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ఆశించిన సత్ఫలితాలు అందిస్తుందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్శంగా మహిళా సంక్షేమశాఖ, మహిళా పోలీసు సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద శనివారం జేసీ నిషాంతి ప్రారంభించారు.
కోటిపల్లి పుణ్యక్షేత్రంలో ఈనెల 25 నుంచి 27 వరకూ నిర్వహించే శివరాత్రి ఉత్సవాలను, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల అన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్టు జిల్లా కన్వీనర్, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైటీఎస్ రాజు తెలిపారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే లక్ష్యంతో మూడు విడతులుగా కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాకు జమ చేయనుంది. దీనిలో భాగంగా రైతులకు మొదటి విడత నిధులు ఏప్రిల్ నుంచి జూలై వరకు అందజేయనున్నారు.
216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల భూ సేకరణకు అవార్డు పాసై భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు త్వరితగతిన నష్టపరిహారం తీసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు.
కూరగాయ ధరలు తగ్గడంతో నష్టపోకుండా రైతుబజార్లలో నేరుగా రైతులు అమ్ము కునేలా చర్యలు చేపట్టినట్టు జిల్లా మార్కెటింగ్ ఏడీ కె.రాఘవేంద్రరావు తెలిపారు.