Home » Kodi Pandelu
ఉయ్యూరు మండల పరిధిలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట, కాయ్ రాజా కాయ్లు పెద్దఎత్తున జరిగాయి. పెదఓగిరాల సెంటర్ సమీపాన, ఆకునూరు, కాటూరులో భారీగా బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కోడి పందేలు వేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వెనుక నడుస్తున్న కోట్ల రూపాయల లావాదేవీలు మరోసారి వెలుగులోకి రావడంతో, రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. భోగి నుంచి కనుమ వరకూ ఎక్కడ చూసినా పందేల హడావిడి ఉత్కంఠగా కనిపిస్తుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
Sankranti 2025: కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి కోడి పంజులను బరిలో నిలిపితే.. విజయం తథ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ కోడి పుంజులను ఓ దిశలో బరిలో దింపితే యజమానులకు సైతం దశ తిరుగుతోందని అంటున్నారు.
Kodi Pandalu: సంక్రాంతి పండుగ మూడు రోజులు లక్ష్యంగా చేసుకుని కోడి పందేల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిమిషాల వ్యవధిలోనే కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు
కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు.