Home » Kishan Reddy G
సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉప్పల్ సభలో కిషన్రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు.
కార్పొరేట్ స్కూల్స్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్గా ఉండి యువతను కాపాడుకోవాలని సూచించారు.
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(RMU)కు 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
2022లో దీపావళి రోజున మొదలైన రోజ్గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది కేవలం ఉద్యోగాల కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మిషన్ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్ను ప్రోత్సహించాలని సూచించారు.
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
సర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు.
బండి భగీరథ్ ఎపిసోడ్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.