Home » Kerala
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కేరళలో బీజేపీకి మరింత బలం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్వంటీ20 పార్టీ లాంఛనంగా ఎన్డీయే కూటమిలో చేరింది.
దీపక్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైందని పేర్కొంటూ షిమ్జితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమెను అరెస్ట్ చేశారు.
కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
శబరిమల బంగారం చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు ఉన్నికృష్ణన్, దేవశ్వం బోర్డు మాజీ ప్రెసిడెంట్ పద్మకుమార్కు సంబంధించిన పలు చోట్ల రెయిడ్స్ నిర్వహించింది.
కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా(మహామాఘ మహోత్సవం)’ ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ సదరు ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఒక యువతి.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
రూ.1 కోటి గెలిచిన ఓ వ్యక్తి లాటరీ టిక్కెట్ను కొందరు దోచుకున్న వైనం కేరళలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్ గదిలో గురువారం ఇద్దరు స్పోర్ట్స్ ట్రైనీలు ఉరివేసుకుని మరణించారు. కోజికోడ్కు చెందిన 17 బాలిక, తిరువనంతపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్షా తొలిసారి పర్యటించారు.
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.